కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా, బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులో నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోగులను నిలిపివేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ దంచి కొడుతున్న వానాలతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయి అద్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.