హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. బిలాస్పూర్-తిరునెళ్వేల్లి, కాచిగూడ-నాగర్సోల్, మాతావైష్ణోదేవి కత్రా-తిరునెల్వెల్లి స్టేషన్ల మధ్య పాక్షికంగా రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు షెడ్యూల్వారీగా ఈ రద్దు కొనసాగుతుందని చెప్పారు.
కాచిగూడ-నిజామాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు. అలాగే.. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని పలు స్టేషన్ల మధ్య 22 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ-రాయచూర్, గద్వాల్-రాయచూర్, కాచిగూడ-కర్నూల్, మహబూబ్నగర్-కాచిగూడ, కరీంనగర్-బోధన్, సికింద్రాబాద్-సిద్దిపేట్ పలు స్టేషన్ల మధ్య ఈ నెల 22, 23, 24 తేదీలలో షెడ్యూల్ వారీగా రద్దు చేసినట్టు తెలిపారు.