హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కకుర్తి సచివాలయం సాక్షిగా బయటపడిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమది ప్రజాప్రభుత్వమని ప్రచారం చేసుకునే భట్టివిక్రమార.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే ఎందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు? అని నిలదీశారు. సర్పంచ్లు రోడ్డెకినా ప్రభుత్వం కరుణించడం లేదు. కమీషన్లకు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం కాంట్రాక్టర్ల ఆందోళనతో నిరూపితమైంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.6 వేల కోట్లు బాకీ పడింది. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా, బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెకిస్తున్నది. సెల్ఫీ వీడియోలు పెడితేనో, కోర్టులకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్లో పెడుతున్నారు అని హరీశ్ ధ్వజమెత్తారు.
రాహుల్గాంధీ స్పందించాలి
ఢిల్లీలో తమ బాస్లకు కప్పం కట్టేందుకు అన్నివర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తున్నది. 20% కమీషన్ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కనీవిని ఎరుగని ఘటన. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు మాయని మచ్చ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సాములు, కమీషన్ల ప్రభుత్వమని మరోసారి రుజువైంది. రాహుల్గాంధీ తాను చెప్పే నీతిసూత్రాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే సచివాలయంలో కాంట్రాక్టర్లు.. మంత్రులపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించాలి. కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతున్నది. ప్రతీ వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం. బడా కాంట్రాక్టర్లకు కమీషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం అన్యాయం. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడం అమానుషం. తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. కాంగ్రెస్ పాలనలో ఆర్థికశాఖ నుంచి జరిగిన అన్ని చెల్లింపులపై శ్వేతపత్రం విడుదలచేయాలి అని హరీశ్ డిమాండ్ చేశారు.