Minister Harish Rao | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారడం వల్లే దేశప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ‘ఏ’ టీం. ప్రజల సంక్షేమం చూసే ‘ఏ క్లాస్’ టీం. బీజేపీని ఎదురొనే సత్తా కాంగ్రెస్కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది’ అని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ మీ కండ్లకు కనిపించలేదా? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది? అప్డేట్ తెలుసుకోని ఔట్డేటెడ్ పొలిటీషియన్ రాహుల్గాంధీ’ అని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం రూ. 80,321.57 కోట్లయితే, అవినీతి లక్ష కోట్లని అనడం పెద్ద జోక్ అని పేర్కొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం మీకు తెలియదా? అని రాహుల్గాంధీని ప్రశ్నించారు. స్కీంలు.. స్కాంలలో ఆరితేరిన కాంగ్రెస్.. కుంభకోణాల గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని దుయ్యబట్టారు. ‘అప్పుడే ముదిగొండ కాల్పులు మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసినవాళ్లు.. కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్లు ఎవరూ లేరు. ఖమ్మం సభ ఒక ముకలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు.. ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్రిప్ట్తో రాహుల్ సిట్’ అని హరీశ్రావు నిప్పులుచెరిగారు.