KTR | హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీటి రంగంలోనే దేశానికే తెలంగాణ టీచింగ్ పాయింట్గా మారిందని రాహుల్కు కేటీఆర్ సూచించారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని దాకా వెళ్లిన రాహుల్.. ఆ పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని మంత్రి సూచించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
రాహుల్ జీ..
దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణమంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం..
ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండిదేశ సాగునీటి రంగ చరిత్రలోనే..
అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండిసముద్రంలో కలుస్తున్న…
— KTR (@KTRBRS) October 19, 2023