హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): జనగణనలో భాగంగా కులగణన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
దేశ జనాభాలో 75 కోట్ల మంది బీసీలుంటే, వారికోసం ప్రత్యేక మంత్రి త్వ శాఖ లేదని, ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని కోరా రు. కేంద్ర ప్రభుత్వంలో 54 లక్షల మంది ఉద్యోగులుం టే, అందులో 7.5 లక్షల మంది మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారని, దీన్నిబట్టి 14 శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నదని తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, కేంద్ర ఉద్యోగుల ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్లపై 34 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి జులైలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగిరాకపోతే ఆ సమావేశాలను బహిషరించాలని కోరారు.