Road Accident | మహబూబ్నగర్ : జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు. ఎస్ఐ వెంకట రమణ తన కూతురు, అల్లుడితో కలిసి హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురు అనూష తీవ్ర గాయాలయ్యాయి. అనూషను మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.