సూర్యాపేట రూరల్, డిసెంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడులను ఉసిగొలుపడం దారుణమని అన్నారు.
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గట్టిగా పోరాడుతున్నారని చెప్పా రు. తెలంగాణ వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఈ నెల 29న ఖమ్మం జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నారని తెలిపారు.