కేంద్ర బడ్జెట్పై కొనసాగుతున్న నిరసనలు
ఓయూలో టీఆర్ఎస్వీ ఆధ్వర్వంలో అర్ధనగ్న ప్రదర్శన
నిజామాబాద్ జిల్లా బోధన్లో బడ్జెట్ ప్రతుల దహనం
నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో టీఆర్ఎస్వీ, వామపక్ష, ప్రజాసంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ నిరసన ర్యాలీ, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. హయత్నగర్ లెక్చరర్స్కాలనీలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందు సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. దళితుల అభ్యున్నతికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలో జిల్లా దళిత సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం దళితజాతిని అణగదొక్కే కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేశారు.