హైదరాబాద్ : ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొటెం చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి భూపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భూపాల్ రెడ్డితో పాటు మంత్రులు తన్నీరు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి విప్ లు ఎమ్మెఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్ రావు, శాసన మండలి సభ్యులు శేరి శుభాష్ రెడ్డి ఉన్నారు.