వేల్పూర్, నవంబర్ 25: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శనివారం ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మణిపూర్లో ఆర్ఎస్ఎస్ గూండాలతో ఎస్టీ కోయబిడ్డలను ఊచకోత కోసిన విషయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరువకూడదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను చిన్నచూపు చూస్తూ వర్గీకరణను అడ్డుకుంటున్న బద్ధ శత్రువులని ఆరోపించారు. పదేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబంధు, ఆసరా పెన్షన్ లాంటి అనేక పథకాలను ప్రతి కుటుంబానికి అందిస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.