ధర్మారం/పెద్దపల్లి : దళిత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ శిక్షణ పొందే ఎస్సీ మహిళలకు జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ..ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా దళిత మహిళలకు ఉపాధి కల్పించడానికి అనేక మార్గాలున్నాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో క్లస్టర్గా ఏర్పడి మహిళలు కుట్టు శిక్షణ పొందాలని మంత్రి సూచించారు.
శిక్షణ పొందే మహిళలకు ముందుగానే నాణ్యతగల కుట్టుమిషన్లు అందిస్తామని ఆయన వివరించారు. శిక్షణ పొందిన తర్వాత కూడా మహిళలకు ఉపాధి కల్పన చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
సాయమందిస్తే దేశ ద్రోహులవుతారా..? బీజేపీ నేతల వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
Alia Bhatt | ఆలియా భట్ ఫొటో గ్యాలరీ..
ఆ చిన్నారులను ఆదుకోండి.. మంత్రి కేటీఆర్ ట్వీట్