హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది.
శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.3 టీఎంసీలకుగాను 64.06 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇప్పటికే నిండిన కడెం ప్రాజెక్టుకు 18 వేల క్యూసెకుల ఇన్ఫ్లో వస్తుండగా, 25 వేల క్యుసెక్కులను కిందికి వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వ 21.63 టీఎంసీలకు చేరింది. భద్రాచలం వద్ద 38.90 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 7.59 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.