హైదరాబాద్ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి మంత్రి ప్రశాంత్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా విద్యావ్యస్థ పటిష్టతకు కృషి చేయాలని మంత్రి వేముల సూచించారు.