మిడ్జిల్, ఆగస్టు 18 : నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని , ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు త్వరగా వస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళిగడ్డ సర్పంచ్ చందులాల్..
చౌటగుంట తండా నుంచి తులసీరాం నాయక్తండా వరకు బీటీ కోసం రోడ్డుపై కంకరవేసి పనులు మరిచారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాడు. అసంపూర్తి రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులకు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని, ఈ విషయాన్ని వివరిద్దామంటే తమరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వాపోయాడు. అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఫోన్ ఎత్తను.. ఏమైనా విషయం ఉంటే మెసేజ్ పెట్టాలి’ అని సూచించారు.