హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-13 పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో హోరాహోరీగా సాగాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) మంగళవారం నిర్వహించిన ఈ జాతీయస్థాయి పోటీల్లో 495 మంది అథ్లెట్లు 13 క్రీడాంశాల్లో పోటీపడ్డారు.
ఆసియా గేమ్స్కు ఇదే చివరి సెలెక్షన్ ఈవెంట్ టీఏఏ ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి తెలిపారు. జాతీయ స్థాయి క్రీడా పోటీకి హనుమకొండ ఆతిథ్యం ఇచ్చినా.. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందలేదన్నారు. అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ర్వహించామని చెప్పారు.