హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రెస్క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సును ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా జాతీయ స్థాయిలో మీడియా పోకడలు, ప్రస్తుతం జర్నలిస్టులు ఎదురొంటున్న సవాళ్లు, వారి పనితీరుపై గవర్నర్ శుక్లా ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వానపత్రికను అందజేసింది. సమావేశం సందర్భంగా ప్రెస్క్లబ్ పాలకమండలి సభ్యులు గవర్నర్కు పూలమొకను, హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధికారిక డైరీని అందజేసి సతరించారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ రాజేశ్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దెల్లి బాపురావు, కోశాధికారి రమేశ్ వైట్ల, కార్యవర్గ సభ్యులు ఎన్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.