హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు (15, 16, 18 తేదీల్లో) ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొని, శనివారం నాగర్కర్నూల్లో నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరుకానున్నారు. ఈ నెల 18న జగిత్యాలలోని గీతా విద్యాలయంలో జరిగే సభలో పాల్గొని, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.