హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొన్నది.
నిజామాబాద్-కామారెడ్డి హైవేపై అక్రమంగా వాహనాల పార్కింగ్ వల్ల తన కుమార్తె మరణించిందని పేర్కొంటూ నాగరాజు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన కేంద్ర రవాణా శాఖ, రాష్ట్ర సీఎస్, రోడ్లు భవనాలశాఖలకు నోటీసులు జా రీ చేసింది. విచారణను 6 వారాలకు వాయదా వేసింది.