తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, తారామతి బారాదరి, మక్కా మసీద్లాంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తారు.
దీంతో ఈ చారిత్రక సంపద శిథిలావస్థకు చేరకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా గోల్కొండ వద్ద ఉన్న కుతుబ్ షాహీ సెవెన్ టూంబ్స్కు రంగులు వేసి మెరుగులు దిద్దుతున్నది.