నల్లగొండ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసుల సహకారంతో చిట్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం డీఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఓలేటి మహాలచ్చాలు, గోపాయి వెంకటేష్ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా చెందిన ఇద్దరు యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాగా, గురువారం చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు.
మరింత లోతుగా విచారించగా నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ ప్రాంతాలల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 7 ద్విచక్ర వాహనాలు, 28 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వివరాలను వెల్లడించారు. వీరిపై గతంలోనూ పలు కేసులున్నాయని తెలిపారు.
నిందితులు ఇప్పటివరకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్లగొండ జిల్లా చిట్యాల, కట్టంగూరు, నల్లగొండ టూ టౌన్, హైదరాబాద్ లోని పేట్ బషీర్ బాగ్, హయత్ నగర్, సూర్యాపేట జిల్లా చివ్వెంల ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి