ఊట్కూర్/నారాయణపేట : అభం శుభం తెలియని కూతురు పట్ల కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఈ ఘటన జిల్లాలోని ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొతోళ్లు రమేష్, మంజుల దంపతులకు నలుగురు సంతానం. ఈ క్రమంలో బుధవారం తమ పెద్ద కుమారుడు శివ కుమార్ బర్తడే జరుపుకున్నారు. పుట్టిన రోజు అనంతరం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన తల్లి మంజుల చిన్న కూతురు శివాని (3) చిన్నారి గొంతును బ్లేడ్ కోసింది.
ఆ తర్వాత తాను కూడా గొంతును కోసుకుంది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని స్థానికులు చికిత్సకోసం హైదరాబాద్ నీలోఫర్ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా మంజుల కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తోందని ఆమె భర్త రమేష్, చుట్టుపక్కల నివాసముంటున్న కాలనీ ప్రజలు పేర్కొన్నారు. కాగా జరిగిన సంఘటనపై స్థానికులు 100 డయల్ చేయడంతో ఉట్కూర్ ఎస్ఐ రవి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం