రామప్ప అభివృద్ధిపై సమీక్షలో
రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్
ములుగుటౌన్, నవంబర్24: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. గురువారం ములుగు కలెక్టరేట్లో పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, టూరిజం శాఖ సంయుక్తంగా రామప్ప అభివృద్ధిని సమీక్షించాయి.
రామప్పకు 25 కిలోమీటర్ల మేర యునెసో నిబంధనలు పాటించడంతో పాటు స్థానిక నిబంధనలను రూపొందించుకోవాలని వీ ప్రకాశ్ పేర్కొన్నారు. స్థానిక సంసృతి సంప్రదాయాలు, కట్టుబొట్టును దృష్టిలో పెట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. బయోడైవర్సిటీ రిజిస్టర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంపై అథారిటీ కమిటీ శ్రద్ధ పెట్టి పనిచేయాలని పేర్కొన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో ప్రొఫెసర్ పాండురంగారావు, పాపారావు, టూరిజం శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.