CM KCR | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రా ర్థిస్తూ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి సోమవారం షిరిడీ సా యిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కేంద్రం ఎంత వివక్ష ప్రదర్శించినా, ఎన్ని కుట్రలు చేసినా ఆ దేవుడి ఆశీస్సులు తమకే ఉంటాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై అనేక అభియోగాలు నమోదుచేసిన కేంద్రం ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. యాదగిరిగుట్ట, వేములవాడ, మన్నెంకొండ, కురుమూర్తి, కొండగట్టు తదితర ఆలయాలను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు షిరిడీ సాయిబాబా ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.