మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలోని దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. ప్రణాళికాయుతంగా జరిగిన అభివృద్ధితో మౌలిక వసతులు సైతం మెరుగుపడ్డాయి. కొరటికల్ పంచాయతీలో పల్లె ప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
రూ.30లక్షలతో మురుగు కాల్వలు…
గ్రామంలోని పలు వార్డుల్లో గతంలో మూడు ఫీట్ల లోతు గుంతలు ఉండేవి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్ల మధ్యే మురుగునీరు, వర్షపునీరు నిలిచి చిత్తడిగా మారేది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామసభ ఏర్పాటు చేసుకొని ప్రధాన సమస్యలను గుర్తించారు. పంచాయతీ నిధుల నుంచి రూ.30 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు పలు వార్డుల్లో రూ.43లక్షలతో సీసీ రోడ్లను సైతం ఏర్పాటు చేశారు.
జనావాసాల్లో కంపచెట్లు తొలగించారు. కొత్తగా 18 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి లూజు వైర్ల సమస్యను పరిష్కరిం చారు. రూ.10లక్షలతో 240 ఎల్ఈడీ లైట్లను అమర్చారు. పడావుపడ్డ పీహెచ్సీ, పాఠశాల భవనాలను కూల్చివేశారు. పంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంలో 10వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకును నిర్మించారు. గ్రామ భద్రత కోసం ప్రధాన వీధుల వెంట రూ.5లక్షలతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వైకుంఠధామం..
గ్రామంలో ఎవరైనా చనిపోయినపుడు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సర్వే నంబర్ 177లో రూ.12.6లక్షలతో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు చొప్పున బర్నింగ్ పాయింట్లు, దింపుడు కళ్లాలు నిర్మించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు సైతం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆఫీస్ రూం, పూజ గది కూడా ఉంది.
రోజు విడిచి రోజు చెత్త సేకరణ…
ప్రభుత్వం పంచాయతీ నిధుల నుంచి రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను సమకూర్చింది. దీనితో గ్రామంలో రోజు విడిచి రోజు పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 177లో రూ.2.5లక్షలతో నిర్మించిన కంపోస్టు షెడ్లో చెత్తను ఉపయోగించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 క్వింటాళ్ల ఎరువుగా తయారుకాగా గ్రామంలో హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలకు వేశారు. పనికిరాని చెత్తను వేసేందుకు రూ.50వేలతో డంపింగ్యార్డునూ ఏర్పాటు చేశారు.
పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం..
నాటి తాసీల్దార్ దేశ్యా నాయక్ చొరవతో సర్వే నంబర్ 476లో మూడు ఎకరాల భూమిని గుర్తించి పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. ఇందులోని ఎకరం విస్తీ ర్ణంలో 3,133 మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మరో ఎకరం లో కోతుల పలహారశాల కోసం బాదం, సీతాఫలం, చింత, మామిడి, అల్లనేరేడు, తదితర రకాలకు చెందిన 1,000 మొక్కలు నాటారు. మిగిలిన ఎకరంలో బ్లాక్ ప్లాంటేషన్ కింద 800 యూకలిప్టస్ మొక్కలు నాటారు. రాష్ట్ర సర్కారు ప్రతి మండలంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కొరటికల్లోనే ఏర్పాటు చేశారు.
తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు చొరవతో సర్వే నంబర్ 523లో బృహత్ పల్లె ప్రకృతి వనానికి 10 ఎకరాల భూమిని కేటా యించారు. ప్రస్తుతం ఇందులో 31వేల మొక్కలను నాటుతున్నారు. వీటితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్లకు ఇరువైపులా 3,190 మొక్కలు నాటి రూ.2లక్షలతో ట్రీగార్డులను అమర్చారు. ఇండ్ల వద్ద నాటేందుకు గ్రామస్తులకు సుమారు 23,526 మొక్కలను పంపిణీ చేశారు.