హైదరాబాద్ సిటీబ్యూరో : మోదీ పర్యటనపై హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన నీకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు.. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారు.
అంటూ తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా మోదీ చేసిన వ్యాఖ్యలను తేదీలతో సహా పేర్కొన్నారు. మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.