గద్వాల అర్బన్, ఆగస్టు 16 : ఉత్తమ అవార్డు అందుకొని గంటలు గడువక ముందే.. ఓ ఉద్యోగి గుండెనొప్పితో మరణించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న చెనుగోనిపల్లికి చెందిన జహంగీర్ (27) అలంపూర్లో 108 అంబులెన్స్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఐదేండ్లుగా వైద్య సేవలందిస్త్తూ మన్ననలు పొందాడు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఉదయం అవార్డు అందుకోగా.. రాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108 సర్వీస్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన జహంగీర్ నేడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడని కుటుంబసభ్యులు విలపించారు.