హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిలువెత్తు చిత్రపటాన్ని నవధాన్యాలతో రూపొందించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బహూకరించారు. ఆర్టిస్టు గొట్టేటి బాలకృష్ణ అతని కుమార్తె సాయిశ్రీ 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో సీఎం చిత్రపటాన్ని రూపొందించారు. ఈ చిత్రపటాన్ని దశాబ్ది ఉత్సవాల్లో సత్తుపల్లి రైతు వేదికలో ప్రదర్శించినట్లు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే సండ్ర వివరించారు. ఎమ్మెల్యే వెంట సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆర్టిస్టులు గొట్టేటి బాలకృష్ణ, సాయిశ్రీ ఉన్నారు.