హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొందరి కండ్లకు కనిపించటం లేదని, వాళ్లంతా కండ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలి ప్రాంగణంలో గురువారం మహాత్మాగాంధీ,బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నాయకులు అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వ్యవసాయం కోసం ప్రతి ఒకరూ తమ బావుల వద్ద ఇండ్లు కట్టుకోవడం సహజమేనని పేర్కొన్నారు.
వ్యవసాయమే తెలియని వాళ్లకు ఫార్మ్హౌస్ల ప్రాముఖ్యత ఏం తెలుస్తుందని? ప్రశ్నించారు. ఇకడ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారు రాష్టానికి ఏం మేలు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేండ్లలో రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కంటి వెలుగు వంటి అనేక విభిన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం తప్పా.. ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేశాం అని చెప్పుకొనే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండీ.. ప్రజలకు ఎలా మేలు చేయాలి అనే ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బందులు పెడుదామనే ధోరణితో కేంద్రానికి చెందిన కొందరు ప్రముఖులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలుప్రభాకర్రావు, గంగాధర్గౌడ్, ఫారూక్ హుస్సేన్,దయానంద్, సురభి వాణీదేవి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి, బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, మండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.