వికారాబాద్ : జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు విడుదల కోసం ఇరిగేషన్ అధికారులు నిత్యం చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయంపైనే అధారపడి ఉందన్నారు. పంట సాగు కోసం నీటి విడుదలకు ఉపయోగపడే చెరువులను, కుంటలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సాగు కోసం నీరు విడుదల సమయంలో డిస్ట్రిబూటరీ కెనాల్లో ఎమైనా మరమ్మతులు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను సూచించారు.
నియోజకవర్గంలోని చెరువులు ఎలా ఉన్నాయి. వాటికి కావాల్సిన సదుపాయలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ఎక్కడైనా చెరువులకు మర్మతులు అవసరం ఉంటే ఉంటే వెంటనే మరమ్మతుల చర్యలు చేపట్టాలని తెలిపారు.
అధికారులు ప్రతి రోజు ఒక చెరువును పరిశీలించి పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గంలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురి కాకుండ కాపాడాల్సన భాధ్యత అధికారులే తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డీఈ రవికుమార్, భాస్కర్గౌడ్, ఏఈలు పీవీ.అదిత్య, నవీన్, వరప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్