మంచిర్యాల : పురుగుల మందు(Insecticide) తాగి పాలిటెక్నిక్ విద్యార్థిని)Polytechnic student) బలవన్మరణానికి(Commits suicide)పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాలకు చెందిన భీముని వైష్ణవి (20) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఈఐ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కాగా, కళాశాల లెక్చరర్లు సాంబయ్య, మాలతి, నాగరాజుల వేధింపుల కారణంతోనే వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి నరసింహులు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.