కొత్తగూడెం క్రైం/చర్ల, డిసెంబర్ 1: పీఎల్జీఏ 23వ వార్షికోత్సవ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చా టుకునేందుకు పోలీస్ బలగాలను టార్గెట్ చేశారు. వారి ప్లాన్ను భగ్నం చేస్తూ భద్రాద్రి జిల్లా పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులో అమర్చిన 40 కిలోల ల్యాండ్ మైన్ను నిర్వీ ర్యం చేశారు. ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులను టార్గెట్ చేస్తూ చర్ల మండల పరిధిలోని పెద్దబీడిసిలేరు అటవీ ప్రాంతానికి వెళ్లే రహదారిలో 40 కిలోల ల్యాండ్ మైన్ను అమర్చా రు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీస్ శాఖ బాంబ్ స్కాడ్ సహకారంతో గురువారం సాయంత్రం ల్యాండ్మైన్ను గుర్తించారు.
శుక్రవారం ల్యాండ్మైన్ను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి బ్లాస్ట్ చేసి పెనుముప్పును తప్పించారు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి వెళ్లే బలగాలను టార్గెట్ చేస్తూ ఈ ల్యాండ్మైన్ పెట్టారని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే.. ఆదివాసీలు ఓటేయకుండా మావోయిస్టులు అనేక రకాలుగా బెదిరించారని, అయినప్పటికీ 90 శాతం ఆదివాసీలు పోలీస్ శాఖపై ఉన్న నమ్మకంతో ఓటేసి తమ చైతన్యాన్ని చాటారని ఎస్పీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సహకరించిన సీఆర్పీఎఫ్ బలగాలను ఆయన అభినందించారు.