ఎల్కతుర్తి, అక్టోబర్ 16: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరదా కప్పి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి మధ్యప్రదేశ్ రాష్ర్టానికి గంజాయిని తరలిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద తనిఖీ చేయగా భారీగా గంజాయి పట్టుబడింది.
ఎస్సై రాజుకుమార్, సిబ్బంది పట్టుబడిన వ్యాన్ను, గంజాయిని స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జగత్సింగ్ అక్కడికి చేరుకొని పోలీసు అధికారులతో మాట్లాడి పట్టుబడిన గంజాయికి పంచనామా నిర్వహించారు. గంజాయిని తూకం వేయగా సుమారు 3క్వింటాళ్ల వరకు ఉంది. అనంతరం గంజాయి తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్, క్లీనర్తో పాటు వ్యాన్ను పోలీసుస్టేషన్కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.