Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఓటర్లు, ఎన్నికల అధికారులు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రోడ్డుపై అమర్చిన ల్యాండ్మైన్ను పోలీసు బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు.
చర్ల మండల పరిధిలోని బేస్త కొత్తూరు, చిన్న మిడిసేలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు పోలింగ్కు దూరంగా ఉండాలని మావోయిస్టులు ఆదేశించారు. దీంతో పాటు ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు కూడా మావోయిస్టులు కుట్ర పన్నారు. బేస్త కొత్తూరు – చిన్న మిడిసేలేరు రహదారిపై ల్యాండ్మైన్ను అమర్చారు. ఈ ల్యాండ్మైన్ను పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఓటర్లను మరో దారిలో పోలింగ్ కేంద్రాలకు పంపించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 40 కిలోల ల్యాండ్మైన్ను పోలీసులు నిర్వీర్యం చేశారు. ల్యాండ్మైన్ ధాటికి రోడ్డు 6 కిలోమీటర్ల లోతున గొయ్యి పడింది.