షాద్నగర్, ఫిబ్రవరి 17: రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ సామాన్యుడిపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు జులుం ప్రదర్శించారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డా రు. బాధితుడి కథనం ప్రకారం.. కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన కుమ్మరి వెంకటేశ్ బోరు మోటర్లను రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి పని ము గించుకొని పట్టణంలోని పరిగి రోడ్డులోని ఓ వైన్ షాప్ముందు నిలబడ్డాడు. ఆ వైన్స్లో నుంచి ఓ వ్యక్తి అక్కడే ఉన్న పోలీస్ పెట్రోలిం గ్ వాహనం వద్దకు వచ్చి ఏదో కవర్ ఇచ్చా డు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న వెంకటేశ్ గమనించినట్టు భావించిన ఇద్దరు కానిస్టేబు ళ్లు అతడిపై నోరు పారేసుకున్నారు. బూతులు తిడుతూ, బెదిరింపులకు దిగారు. ఇక్కడ ఏం పని? అంటూ కొట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి శరీరంపై గాయాలయ్యేలా చితకబాదారు. అనంతరం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసుల దాడిలో వెంకటేశ్ కంటికి తీవ్ర గాయమైంది. కాళ్లపై, పిరుదులపై తీవ్రంగా కొట్టారని బాధితుడు వాపోయాడు. అకారణంగా పోలీసులు దాడిచేశారని ఈ విషయమై మంగళవారం షాద్నగర్ సీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.