ఐఎస్బీ వార్షికోత్సవానికి హాజరు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభాగాలు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాయి. గురువారం మధ్యాహ్నం 1.25 ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు.
అక్కడినుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఐఎస్బీ చేరుకొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి బేగంపేట మీదుగా చెన్నైకి వెళ్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలుచేస్తున్నారు. గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులకు గురువారం పూర్తిగా వర్క్ ఫ్రం హోం ప్రకటించారు.