హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు. దాదాపు 60 దేశాలకు చెందిన 13,500 మంది విద్యార్థులు ఐఎస్బీలో చదువుకొన్నారు. 49 వేల ఎగ్జిక్యూటివ్లు, 600లకు పైగా వ్యాపారవేత్తలు ఐఎస్బీ కోర్సులను పూర్తిచేశారు.
ఇక్కడి విద్యార్థులకు భారీ డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా ప్రముఖ సంస్థలు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఐటీసీ లిమిటెడ్, సిరియోన్ ల్యాబ్స్, పీడబ్ల్యూపీ డియోక్, ఇండిజెన్ఇంక్, వాటర్ఫీల్డ్ అడ్వైజర్స్, ల్యాండ్ మార్క్, యాంబిట్ సంస్థలు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ సంస్థ ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటున్నది. గురువారం ఐఎస్బీలో నిర్వహించే ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
ఐఎస్బీ చరిత్రలో ముఖ్య ఘట్టాలు
ప్రముఖుల సందర్శనలు