ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేంద్రబడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చేయని మోదీ సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నదన్నారు. మతం పేరిట పాలన సాగిస్తూ దేశ ప్రతిష్ఠను భ్రష్టుపట్టిస్తున్న మోదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడ టం ఖాయమన్నారు. కేంద్రం సా యం చేయకపోయినా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారని ఎంపీ కొనియాడారు.