భీంపూర్, సెప్టెంబర్ 4: రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిప త్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏడాదికి రెండు విడతలుగా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయం చేస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నా రు. మోదీ సర్కారు ఎంత భూమి ఉన్నా ఏడాదికి రూ.6 వేలే ఇస్తున్నదని, ఇదీ మూడు విడతలుగా అందిస్తున్నదని, ఆ ఇచ్చే అరకొర కూ డా ఏడాదిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్లి(టి) పంచాయతీ పరిధిలోని అర్లి, శాంతినగర్, మందపల్లి శివార్ల పరిధిలో 400 మంది రైతులను పీఎం కిసాన్ డబ్బులు పడ టం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులను అడిగితే కేవైసీ కాకపోవడంతో డబ్బులు రాలేదని అంటున్నారని తెలిపారు. పీఎం కిసా న్ పునరుద్ధరించకుంటే 26 పంచాయతీల పరిధి గ్రామాల రైతులతో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుసంఘ ప్రతినిధి బొంత నితిన్, రైతులు గుమ్ముల దేవయ్య, సుంకర ప్రభాకర్, మహ్మద్ రసూల్ సహా 200 మంది రైతులు ఉన్నారు.