కుమ్రంభీం జిల్లా పీఎం అవార్డుకు ఎంపిక పట్ల
మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకం అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఏడా ది నుంచి ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా అమలు చేస్తున్నామని, ఇందుకు ఎంపికైన 9 జిల్లాల్లో కుమ్రం భీం జిల్లా కూడా ఉన్నదని చెప్పారు.
కుమ్రం భీం జిల్లా పీఎం అవార్డుకు ఎంపికకావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, కలెక్టర్ రాహుల్రాజ్ను అభినందించారు. అవార్డును ప్రధాని మోదీ చేతులమీదుగా సివిల్ సర్వీసెస్ డే సందర్భం గా ఈ నెల 21న కలెక్టర్ అందుకోనున్నారు. పీఎం అవార్డుకు జిల్లా ఎంపిక పట్ల కలెక్టర్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.