మహబూబాబాద్ : రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.పట్టణ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా..సోమవారం తొర్రూరు పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు కోటి 25 లక్షల బ్యాంకు లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణ వీధుల్లో పర్యటించారు. పారిశుధ్యం, మురుగు నీటి కాలువలు, మంచినీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో పట్టణ ప్రగతి కింద 4 కోట్లు మంజూరయ్యాయి. రూ.6,110 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. 445 మందికి కేసీఆర్ కిట్లు అందాయి.
తొర్రూరు సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. పట్టణంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
మున్సిపాలిటీ ఏర్పాటు జరిగిన పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. మహిళలకు కుట్టు మిషన్ల ను ఉచితంగా ఇస్తాం. శిక్షణ తీసుకొని అభివృద్ధి చెందాలన్నారు. అలాగే దేశానికి కేసీఆర్ దిశా నిర్దేశం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో..మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, కమిషనర్ గుండె బాబు, జెడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పీఏసీఎస్ చైర్ పర్సన్ పసుమర్తి శాంత, పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.