సంగారెడ్డి : ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో జరుగుతున్న ఫీవర్ సర్వేను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల ఇండ్లలో ఫీవర్ సర్వే జరిగింది. లక్ష మందికి హోం ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశామన్నారు.
ముందస్తుగా ఫీవర్ సర్వే చేసి కిట్స్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలి. కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పేర్కొన్నారు. మరో నాలుగు, ఐదు రోజుల్లో ఫీవర్ సర్వే వంద శాతం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల కొవిడ్స్ బెడ్స్ అందుబాటులో ఉంచాం. కరోనా బారిన పడిన గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గర్భిణుల కరోనా చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.