జనగామ రూరల్, నవంబర్20: గుజరాత్ నుంచి అమిత్షా, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియంక గాంధీ ఇలా ఎవరు వచ్చినా.. తెలంగాణకు సీఎం కేసీఆర్ బాద్షా అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గానుగుపహాడ్ కల్యాన్నగర్, యశ్వంతాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వార్డుల్లో ప్రచారం చేస్తుంటే కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి.. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీలు మార్చారని విమర్శించారు. ఎర్రకుంట తండాలో పల్లా, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య లంబాడీలతో కలిసి నృత్యాలు చేశారు.