హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.
అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. గ్యాస్ స్టవ్లపై కట్టెలు పెట్టి మోదీ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
పేదలకు పెను భారంగా మారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యాక్రమాల్లో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో..
హైదరాబాద్ జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
జనగామ జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..