Patnam Mahender Reddy | హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఎ మ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డికి మంత్రివర్గంలో మరోసారి స్థానం దకనున్నది. సీఎం కేసీఆర్ గురువారం చేపట్టనున్న క్యాబినెట్ విస్తరణలో రెండోసారి మం త్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. రాష్ట్ర తొలి క్యాబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్రెడ్డికి బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఉండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్రెడ్డి స్థానంలో 2019 జూన్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి మహేందర్రెడ్డి గెలుపొందారు.