హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్, భార్య పట్నం సునీత రెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డితో కలిపి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌ,డ్ కాలే యాదయ్య, కృష్ణారావు, బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు రమేశ్ హజారీ, మారుతి సాగర్, బసవ పున్నయ్య, తదితరులు హాజరయ్యారు.