హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు. జాన్డీస్తో బాధపడుతున్న ఆయన గత మూడు రోజులుగా నగరంలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజాన 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కిరణ్మయి, కుమార్తె, కూతురు ఉన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.