నిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్ మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. లాక్డౌన్, జ్వర సర్వేను పరిశీలించారు. పలు కుటుంబాలతో మాట్లాడారు. సర్వే గురించి అడిగి తెలుసుకుని, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వారికి ఔషధాలు అందజేసి, ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. కొన్ని చోట్ల జలుబు ఉంటే జలుబుకు సంబంధించిన మందులు మాత్రమే ఇచ్చారని, అలా కాకుండా జలుబు ఉన్నా ఇంకా కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా కిట్ మొత్తం ఇవ్వాలని సూచించారు.
ఇంటింటి సర్వేకు మరోమారు వెళ్లినపుడు ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్యపరిస్థితులను తెలుసుకోవాలని, వెంట వార్డు సభ్యులను తీసుకెళ్లాలని చెప్పారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడం, ఇంటింటి సర్వేతో కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం