మంచిర్యాల : ఓ అభాగ్యుడి ఆకలి తీర్చి ఆ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. జిల్లాలోని కోటపల్లి మండల ఎస్ఐ రవికుమార్ పారుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 63 పై మతిస్థిమితం లేని వ్యక్తి ఆకలితో అలమటిస్తూ కదలలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాడు. ఇది గమనించిన ఎస్ఐ ఆ వ్యక్తి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడలేని స్థితిలో లేని వ్యక్తి పరిస్థితిని గమనించిన ఎస్ఐ తన వెంట తెచ్చుకున్న భోజనంతోపాటు నీళ్లు, బిస్కెట్లు అందించి ఆ వ్యక్తి ఆకలి తీర్చాడు. సహృదయతను చాటుకున్న ఎస్ఐని పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం