హనుమకొండ, మార్చి 3: వరంగల్ జిల్లాలో యోగా కేంద్రానికి తమ ట్రస్ట్ ద్వారా 200 ఎకరాలు కేటాయిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. శ్రీరామచంద్రమిషన్, సాం స్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న యోగా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందుకోసం తన స్వగ్రామం పర్వతగిరి పక్కనున్న కల్లెడ సమీపంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలోని 200ఎకరాలను యోగా కేంద్రానికి అప్పగించనున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో యోగా గురు దాజీ, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.